14/06/2026
// విహాన్ న్యూస్14//
బాసర మెస్ ఘటనపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి: డిమాండ్!
బాసర (నిర్మల్ జిల్లా):
బాసర ( ) లోని ఈ-1, ఈ-2 శక్తి భోజనశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించిన అల్పాహారం (చపాతీ, ఆలుగడ్డ కూర) లో బొద్దింక వచ్చినట్లు వే2న్యూస్ కథనాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆధారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ పేర్కొన్నారు.
క్యాంపస్లో ఆహార నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే నేడు మళ్లీ ఇలాంటి దుస్థితి పునరావృతమైందని ఆయన విమర్శించారు. వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఇలాంటి తీవ్రమైన విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని నేరం.
ఈ ఫోటోషూట్ రాజకీయాలను పక్కన పెట్టి, విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడక ముందే స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు.
భవిష్యత్తు కార్యచరణ:
బాసర IIIT లోని మెస్ సమస్యలపై, గతంలో విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపకపోతే... దీనిపై విద్యార్థి లోకాన్ని ఏకం చేసి AIPSU ఆధ్వర్యంలో రేపటి నుండి పకడ్బందీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను, పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము.
ఇట్లు,
గడపాలి పరమేష్,
జిల్లా కార్యదర్శి,
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU), నిర్మల్ జిల్లా.