07/11/2022
మునుగోడు ఏలక్షను......
మునుగోడు ఏలక్షను ముగిసి
అప్పుడే మునపటి దాయే...
మూడు పార్టీలకు ముచ్చెమటలు పోయించే...
గాలి మూటల హామీలు నాయకులు
వదిలి పోయే....
గాసిప్పులతో ఎవరి డంకా వారే మ్రోగించే...
గడప గడపకు గడ్డం పట్టి ఓటు అడిగే...
నోట్లు చూపి వోటరుకు ఎర వేసే.. .
మధ్య బ్రోకరు తో మధ్యాన్ని చేర వేసే....
ర్యాలీలకు రమ్మంటూ రాచ మర్యాదలు చేసే....
పార్టీలు యెదురు పడి ఎగిరీ ఎగిరి తన్నుకొనే...
దున్నపోతుల కుమ్ములాటలో దూడలా జనం నలిగి పోయె...
రక్షణ సిబ్బందికి రక్షణ కరువాయె....
రాళ్ళ దాడికి వాళ్లు సయితం షికారాయే....
రొక్కం అందిన ఓటరు రెక్కలు కట్టుకుని
ఓటు వేసి పోయె.....
రొక్కం అందని ఓటరు అలిగి రచ్చ రచ్చ
చేసి పోయె.....
రికాము లేక రిపోర్టర్లు ఊరకలు పెట్టే....
టీ ఆర్ పీ లు పెరిగి టీవీ లకు సంబరాలు ఆయే...
ప్రచారానికి ముగింపు అని ఏలక్షను కమిషన్ చెప్పే...
ప్రజా నాయకులను ప్రతిఘటించమనీ ప్రకటనలు చేసే..
ఏలక్షను బూతు కాడ పోటేత్తిన జనాలు...
పొద్దుగుంకి నాక కూడా పోలేమన్న వైనాలు....
ఏలక్షను సిబ్బందికి యనలేని తిప్పలు...
ఎటు పోని, చెప్పలేని పలు పలు వ్యధలు....
ఈ వీ యం ల భద్రత కై కట్టు దిట్ట చర్యలు...
విధిగా నిలుచు న్న వివిధ రక్షణ బృందాలు...
ఎగ్జిట్ పోల్స్ అంటూ యెన్నో ఎగిరి పడ్డాయి...
వారనకునే వారినే యెంచి అగ్రగామి చేశాయి...
నాయకుల అంచనాలు తారుమారు చేశాయి...
వాళ్ల గుండెల్లో రైళ్లను పరుగెట్టించాయి....
ఓటు లెక్కింపు మొదలైంది...
ఓటరు గుండె సవ్వడి తెలిసింది...
లీడర్ కు పాదరసం మీట పైకి యెగిసింది....
ఫలితాల పట్టిక అంకెలు పరుగులు పెట్టింది..
ఫలితాల ప్రకటనలు ప్రకంపనలు లేపింది....
ఓటమీ పాలయితే కారణాలు వెతికింది...
గెలుపు పొందిన వాడిని అంబరమున చేర్చినది...
గాదె రమేష్.
07.11.2022.